చిరంజీవి, ఏఆర్ రెహ్మాన్, చిత్రమ్మకు క్షమాపణలు చెప్పిన రాకేష్....
on Mar 17, 2025
ఇష్మార్ట్ జోడి సీజన్ 3 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమో మొత్తం కూడా రాకేష్ కబ్జా చేసేసాడు. అత్తా-కోడళ్ళు అదేనండి రాకేష్ వాళ్ళ అమ్మ - భార్య సుజాత కలిసి రాకేష్ ని టార్చెర్ పెట్టారు. దాంతో చిరంజీవికి, సారీ చెప్పాల్సి వచ్చింది. అదేంటో చూద్దాం...రాకేష్ వాళ్ళ అమ్మ స్టేజి మీద వచ్చి చిరు సాంగ్ "దాయి దాయి దామ్మా"కి డాన్స్ చేసారు. దాంతో రాకేష్ ఆపండి అంటూ అరిచాడు. "చిరంజీవి గారు క్షమించాలి..మా ఫ్యామిలీ మీకు తెలుసు. ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి బ్లేసింగ్స్ తీసుకున్నా..మళ్ళీ వచ్చి తీసుకుంటా." అన్నాడు..తర్వాత సుజాత మాములుగా ఏడిపించలేదు. రోజా మూవీ నుంచి "నా చెలి రోజావే" సాంగ్ కి ముందు వచ్చే గాత్రాన్ని ఇమిటేట్ చేయమని సుజాతకు ఓంకార్ చెప్పేసరికి రాకేష్ షాకయ్యాడు.
వెంటనే నిలబడి "ఏఆర్ రెహ్మాన్ సర్ ..నేను మీకు తెలీదు. ఇలాంటి తప్పు మళ్ళీ జరక్కుండా చూసుకోవడానికి మాక్స్ ట్రై చేస్తున్నా సర్ ..చిత్రమ్మా నేను మీకు తెలుసు. అమ్మా నేను నీ కొడుకు లాంటి వాడిని.. మీ కోడలు ఇంత దారుణం చేస్తుంటే చూడలేకపోయానమ్మా " అంటూ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక రాకేష్ చెప్పిన ఫన్నీ క్షమాపణలకు అందరూ నవ్వేశారు. ఇక ఈ గ్రాండ్ ఫినాలేలో పార్టిసిపేట్ చేసిన జోడీస్ అందరికీ రకరకాల టాస్కులు ఇచ్చాడు ఓంకార్. ఇక అమర్ మాట్లాడుతూ "ఇష్మార్ట్ జోడి ఈజ్ ది బెస్ట్ ఇన్ మై లైఫ్ ..ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ మెంబర్స్ ఐ లవ్ యు ఆల్" అంటూ అరిచి మరీ గట్టిగా చెప్పాడు. తర్వాత సీనియర్ నటుడు ప్రదీప్ కూడా మాట్లాడారు "36 ఏళ్ళ నుంచి ప్రేమ ఉంటుంది కాబట్టి టెక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా ఉంటాం. నా భార్యే కదా అర్ధం చేసుకుంటుందిలే అనుకుంటాం. ఇలాంటి వేదిక ఉంటే ఐ లవ్ యు సరస్ "అని చెప్పడం ఆనందంగా ఉంది అని చెప్పారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
